శనివారం, జులై 28, 2018

ఒక మామ తన ముగ్గురు అల్లుళ్లను బాగా కట్నకానుకలిచ్చి ప్రయోజకుల్ని చేశాడు.

 ఒకరోజు వారిని పిలిచి 'నేను చనిపోయినపుడు మీరు ముగ్గురూ తలొక లక్షరూపాయలు నా శవ పేటికలో పెట్టండి' అని కోరితే వారు అంగీకరించారు.

 కొన్నాళ్ళకు మామ చనిపోయాడు.

డాక్టర్ గా ఎంతో గొప్పవాడైన పెద్దల్లుడు మామ కోరిక మేరకు 500 నోట్లు 200 తెచ్చి శవపేటికలో పెట్టాడు.

 ఇంజనీర్ గా పైకొచ్చిన రెండవ అల్లుడు 2000 నోట్లు 50 తెచ్చి మామ శవపేటికలో పెట్టాడు.

 మూడవవాడు లాయర్ గా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతడొచ్చి  తాను రాసిన మూడులక్షల రూపాయల చెక్కును శవపేటికలో పెట్టి , అందులోని రెండులక్షల నగదు తీసేసుకున్నాడు.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts