గురువారం, డిసెంబర్ 06, 2018

హాయ్ ఫ్రెండ్స్ SBI Bank లో Deputy Manager ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 39 పోస్టులు (The bank will recruit 39 posts of Deputy Manager) భర్తీ నిమిత్తం అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. మీరు అప్లయ్ చేయాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ తరువాత అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్ మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి.

సోమవారం, డిసెంబర్ 03, 2018

Andhra Pradesh SSC Board 10th class final exams Time Table ను అప్ డేట్ చేసింది. మీ పిల్లలు ఎవరైనా 10వ తరగతి చదువుతుంటే వెంటనే వారికి తెలియజేయండి. మరిన్ని వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.
Click HereAP 10th Class Time Table 2019

బుధవారం, నవంబర్ 28, 2018

AP SA2 CCE Hindi Objective Model Question papers for 8th,9th, 6th,7th Classes

AP/Telangana Summative Assessment 2 (SA2) Hindi 1st 2nd Language CCE SA 2/Summative 2/Summative Assessment 2 Anual Exams Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 HINDI Question Papers for 6th,7th,8th,9th, Classes students in AP & Telangana.

Summative Assessment 2 SA2 Objective Type Hindi Model Question papers, Bits for OMR Based Exam

AP SA2 8th Class Hindi Model papers
AP SA2 9th Class Hindi Question Paper 

ఆదివారం, నవంబర్ 25, 2018

AP SA2 English Model Question papers CCE for 6th,7th,8th,9th Classes

 AP SA 2 (Annual) English Paper 1 & Paper 2 CCE SA 2/Summative 2/Summative Assessment 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 English Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana. AP Summative Assessment 2 (SA 2) English Question Papers CCE 2019 – 6th,7th,8th,9th,10th Classes | SA 2 English Model Papers – Download

గురువారం, నవంబర్ 22, 2018

AP/Telangana Summative Assessment 2 (SA 2), Sanskrit, Composite Model Question Papers CCE SA 2/Summative 2/SA 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 Model Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana.

Andhra/Telangana Summative Assessment 2 (SA 2), Sanskrit, Composite Telugu 1st 2nd Language CCE SA 2/Summative 2/SA 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 TELUGU Model Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana.

6th నుండి 10th Class  వరకు గల SA 2 Telugu Question Papers ను ఇక్కడ అందించడం జరిగింది. అవసరమైన వారు క్రింది లింకుల ద్వారా ఉచితంగా Download చేసుకోవచ్చు. మిగతా మోడల్ పేపర్లు ఈ పోస్టు క్రింది భాగంలో అందించడం జరిగింది. గమనించగలరు.

శనివారం, నవంబర్ 17, 2018

SA1 సోషల్ మోడల్ ప్రశ్న పత్రాలు ఇక్కడ నవీకరించబడ్డాయి. ఉచిత SA1 Social Model Question papers డౌన్లోడ్ కోసం ఈక్రింది లింక్ ద్వారా ఆయా సంబంధిత వెబ్సైట్ కు వెళ్ళవచ్చు. మీకు కావాల్సిన ఏ మోడల్ పేపర్ గురించైనా కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. తప్పనిసరిగా అందించే ప్రయత్నం చేస్తాను.

Click Here to Summative Assessment 1 Social Model Question Papers  – Download

బుధవారం, నవంబర్ 14, 2018

SA1 Maths Model Question Papers for 6th,7th,8th,9th,10th Classes

 AP SA 1 Mathematics Maths Paper 1 & Paper 2 CCE SA 1/SA 1/Summative Assessment 1 Question Papers/Model Papers For 6th,7th,8th,9th,10th Classes. Summative Assessment 1/ SA1 MATHS Question Papers for 6th,7th,8th,9th,10th Classes students in AP & Telangana Govt.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు ఈ నెలలో Summative Assessment 1 పరీక్ష నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాయి. మేము విద్యార్ధుల సౌలభ్యం కొరకు ఇక్కడ Maths Question Papers ,Mathematics Model Papers అందిస్తున్నాము. 6th to 10th Classes వరకు పేపర్లు కావాల్సిన ఈక్రింది లింకుల ద్వారా ఆయా తరగతుల వారు free గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారమంతా మేము వెబ్ ద్వారా వెతికి సంపాదించినవే. ఆయా వెబ్సైట్ల యజమానులకు కృతఙ్ఞతలు.

మంగళవారం, నవంబర్ 13, 2018

CCE Summative Assessment  1 / SA 1 Objective Model Papers  – 8th, 9th, 6th, 7th, 10th Classes

Summative 1 (SA-1) Model Question Papers CCE – 6th,7th,8th,9th,10th Classes by AP SCERT
SA 1 Model Papers 6th to 10th Class
Govt of Andhra Pradesh has released blueprint of New model OMR based objective SA 1 Exam Papers for all Subjects. Andhra Pradesh  High School SA 1 Summative 1 Model Question papers for 6th 7th 8th 9th 10th Classes All Subjects –Telugu, English, Mathematics, General Science, PS, Biology and Social  Question Papers are available here.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు SA 1 పరీక్షల నిమిత్తం OMR ఆధారిత మోడల్ పేపర్ల యొక్క బ్లూప్రింట్ విడుదల చేసింది. ఇక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ అన్ని మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. అవసరమైన వారు ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సోమవారం, నవంబర్ 12, 2018

Canara Bank నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Manager Security పోస్టులు మొత్తం 31 ఖాళీలు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి? వయస్సు పరిమితి ఎంత? జీతభత్యాలు ఏవిధంగా ఉంటాయి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? తదితర వివరాలన్నీ ఈ క్రింది లింక్ లో పొండుపర్చబడియున్నాయి. పూర్తీ వివరాలు క్లిక్ చేసి చూడండి.

శుక్రవారం, నవంబర్ 09, 2018

Download AP SA 1 10th Telugu Model Paper 2

sa1 telugu Model paper 2 2018,
sa1 telugu Model paper 2 10th class,
sa1 telugu paper 2 10th class 2018,
sa1 telugu Model papers 10th class,
sa1 SSC telugu papers 2018,

Hi Friends So You are searching for Ap SA 1 10th Telugu Model Paper 2. You are at the right place to download Summetive 1 SSC Telugu Paper 1 Here. These sa1 10th telugu model paper 2 2018 are very useful to practise for your comming SA/Summetive 1 Exams.

గురువారం, నవంబర్ 08, 2018

Summative 1 SSC Telugu 1st Language Model Paper: AP SCERT Board has recently released SA 1 New odel OMR based objective Exam Papers for all Subjects. Andhra Pradesh / TS Telangana High School SA 1 SA 2 Summative Assessment 1 SA 1 All Model Question papers for 10th Class. AP Summative Assessment 1 10th Class Telugu 1st Language SA 1 Model Paper , SA 1 SSC Telugu 1st Language Model Paper, sa1 telugu question paper 2017-18, sa1 telugu question paper 2017-2018, 10th class sa1 question paper 2017-2018, 10th class sa1 question paper 2017-18, sa1 telugu question paper 2018-2019, apscert model papers 2017, sa1 telugu question paper 10th class 2017, summative assessment model question papers telangana 2016-17.

SA1 మోడల్ పేపర్లను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

మనకి ఎంతో మంది స్నేహితులుగా పరిచయమవ్వడం, వాళ్ళతో కొన్ని వ్యవహారాలు పెట్టుకోవడం సహజంగా జరిగే పరిస్తితి. ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే మనం సమస్యల వలయంలో చిక్కుకోవడం ఖాయం. ఒక సంఘటన చెప్తాను. నాజీవితంలో ఈమధ్యే జరిగింది. కొత్తగా ఒక మిత్రుడు పరిచయమయ్యి బాగా దగ్గరయ్యాడు. అతనిని పరిచయం చేసింది అంతకు ముందు నుండే పరిచయమున్న మరొక మిత్రుడు. ఇలా ముగ్గురమూ వీలున్నప్పుడల్లా పార్కులో కూర్చుని అనేక విషయాలు మాట్లాడుకోవడం,. చర్చించుకోవడం చేసేవాళ్లం. ఒకరోజు కొత్త ఫ్రెండుకి అవసరమని పాత ఫ్రెండు 10,000రూ|| చూడమన్నాడు. సర్లే అని నాదగ్గర లేకపోతే నా ఆప్తమిత్రుడి దగ్గర 10,000రూ|| తీసుకుని పార్కులో ఉన్న నా కొత్త,పాత మిత్రులను కలిసి డబ్బులన్నీ అందించాను. వాళ్ళు ఇస్తామన్న నెలరోజులు గడువు దాటిపోయి మూడు నెలలు ముగిశాయి. నా ఆప్తమిత్రుడు 10,000రూ|| చూచిపెట్టు చాలా అవసరమొచ్చింది అంటే సరే అని వాళ్ళను అడిగాను. అదిగో,ఇదిగో అంటూ మరో నెల రోజులు గడిపి ఫోన్లు సరిగా లిఫ్ట్ చేయడం మానేశారు. సర్లే ఏదో ఇబ్బందిలో ఉన్నారేమోనని నేను పెద్దగా తీసుకోలేదు. ఒకరోజు పార్కులో ముగ్గురమూ కూర్చునప్పుడు నేను అడిగాను. " మీరు 10,000రూ|| త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది.అవతల నా మిత్రుడు ఇబ్బంది పడుతున్నాడు.నన్ను చాలా గట్టిగానే అడుగుతున్నాదంటే నా పాత మిత్రుడు ఆ సమయంలో మాట్లాడిన మాటలకు అతను ఎంత స్వార్ధపరుడో, దుర్మార్గపు భావాలో నాకు అర్ధమయ్యిపోయాయి. పాత మిత్రుడు "అతనితో మనకెందుకండీ..డబ్బులుకోసం అలా ఇబ్బంది పెట్టేవాడు మనకి కరెక్ట్ కాదు. అతనితో ఫ్రెండ్ షిప్ ను కట్ చేసేయండి.మీకు చాలా మంచిది అన్నాడు. ఆసమయంలో నాకు అతని పట్ల అసహ్యం,విపరీతమైన కోపం వచ్చాయి. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్న ఇవ్వకుండా, ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వ్యవహరించే వీళ్లతో స్నేహం చేయాలా? స్నేహ భావంతో ఆపదలకు స్పందించే నా ఆప్తమిత్రుడితో సంబంధాలు తెంచుకోవాలా? ఆ దిక్కుమాలిన స్వార్ధపూరితమైన సలహాకి చెప్పు తీసుకుని కొట్టినా తప్పు లేదనిపించింది. ఉపయాగం కోసం స్నేహం చేసే స్వార్ధపూరితమైన ఇటువంటి వారితో దూరంగా ఉండడమే చాలా మేలని ఆసమయంలో నా అంతరాత్మ ఘోషించింది. తరువాత సీరియస్ గా తీసుకుని డబ్బులు వసూలు చేసి నెమ్మదిగా వాళ్ళను కలవడం తగ్గించి చివరికి కట్ చేసేశాను. ఇటువంటి వ్యక్తులు అందరికీ తారసపడతారు. వాళ్ళను జాగ్రత్తగా హాండిల్ చేస్తూ ముందుకు పోవాలి తప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. శుభం!!!

శుక్రవారం, నవంబర్ 02, 2018

ఆంధ్రా పోలీస్ శాఖలో  3,137 ఉద్యోగాలు రెడీ! | 3,137 jobs in AP Police department

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 3,137 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా పోలీస్ శాఖలకు అనుమతి జారీ చేసింది. 

న‌వంబ‌ర్ 1వ తేదీన  334 ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీ పోలీసు నియామక మండలి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

న‌వంబ‌ర్‌ 12న వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌, జైలువార్డర్లు, డ్రైవర్‌ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. 

దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలను రాయాల్సి ఉంటుంది. ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు వ్రాయాలి. ఒక్కో ప్రశ్నపత్రం వంద మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పత్రాలు ఐచ్ఛికం(ఆబ్జెక్టివ్‌) తరహాలోనే ఉంటాయి. 

మంగళవారం, అక్టోబర్ 30, 2018

SBI Recruitment 2018 | Various Specialist Officers Posts | Apply online


Stat Bank of India వారి జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనిలో అత్యధికంగా బ్యాంక్ ఉద్యోగం నిమిత్తం అభ్యర్ధులను తీసుకోనున్నారు. మీకు తగిన అర్హతలు, ఆసక్తి ఉంటే క్రింది లింక్ ద్వారా వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. వివరాలు పూర్తిగా గమనించడం మర్చిపోవద్దు.

శనివారం, అక్టోబర్ 27, 2018

రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఒక పుస్తకం కొంతవరకైనా చదవడం అలవాటు. నాకదేమిటో కానీ పుస్తకం ముట్టుకోనిదే అసలు నిద్ర పట్టదు. ఆ పరంపరలో భాగంగా ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ చదువుతుంటే అందులో ధీరూభాయ్ అంబానీ గారి మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయి.స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయనగారి మాటల్లో...
      "సూర్యుడు నన్ను మంచం మీద చూసి 50సంవత్సరాలు అయింది"
    ఈ మాటల్లో చాలా లోతైన అర్ధం వుంది. గొప్పవారు పెద్దగా మాట్లాడరు. చాలా మౌనంగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడ వస్తే "ఆ మాటల్లో లెక్కలేనన్ని ఆణిముత్యాలు" దొర్లుతాయి.
    తెల్లవారు జాము నిద్రలేవడం అంటే జీవితంలో సగం విజయాన్ని సాధించడమే! ఆరోగ్య సంస్థలు కూడా తమ,తమ పరిశోధనలలో "తెల్లవారు జాము నిద్రలేచి, రోజుకు 5లీటర్ల నీళ్ళు త్రాగడం ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళకు ఏవిధమైన రోగమూ అంటదు" అని తేల్చి చెప్పేసాయి.
    మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఖురాన్,బైబిల్లు కూడా తెల్లవారు జామున లేచి ప్రార్ధన చేసుకునే వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని శాసిస్తూనే ఉన్నాయి.
   అందుకే కాబోలు గొప్పవాళ్లేప్పుడూ ఈ అవకాశాలను వదులుకోలేదు. మీరే ఆలోచించండి. ధీరూభాయ్ అంభానీ గారీలాంటి గొప్పవారు 50సం// సూర్యుడి కంటే ముందే అంటే ఉద్దేశ్యం తెల్లవారుజామునే నిద్ర లేచేవారు.
  ఈరోజుల్లో మనం చాలా దిగజారిపోతూ ఉన్నామనే చెప్పాలి. రాత్రి 10లేక 11 గంటలకు భోజనం చేయడం, అప్పటి వరకూ TVలకు అతుక్కుపోవడం, మర్నాడు 8,9 గంటలకు నిద్రలేవడం ఆదర,బాదరా హడావుడి...జీవితం అంతా ఒక యంత్రం మాదిరి అయిపోయింది. నిస్తేజం,నీరసం,నిర్వేదం,నిష్తానమ్ ఏవైతే ఉన్నాయో అవ్వన్నీ కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేక చికాకు,చింతనాలతో నిత్యం బాధపడుతూనే వున్నాం.వీటిని ఎలాగైనా మనం జయించాలి.జయించవచ్చు కూడా! ఇప్పటి రోజులు సహకరించవు. పరిస్తితి మన చేతులలో లేదనే మాటలు కుంటి సాకులు మాత్రమే! వళ్ళంతా నీరసం, నిస్తేజం నిండిపోయిన మాటలే!ఇప్పటికీ ఎంతో మంది మేధావులు అవుతూనే ఉన్నారు. గొప్ప,గొప్ప పనులు చేసి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మనాలాగే ఆలోచిస్తే వారా స్తాయికి చేరుకుందురా? ఒక్కసారి ఆలోచించండి! మనం మారిపోదాం! మన జీవిత గమ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం! ఆ పనేదో తెల్లవారు జాము నిద్రలేచిపోయి సరైన ప్లానింగ్ తో ముందుకెళ్దాం!...మీరు రెడీ నా?

గురువారం, అక్టోబర్ 25, 2018

*👴తాత గారి గడియారం*

*తాతగారి గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది.ఎంత వెతికినా దొరకలేదు. మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు.*

*పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు.  గడియారం దొరకలేదు.*

*అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు."నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు. గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు.*

*ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు.*

*"ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత."తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది."*

*🕸నిజమే...ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం...*

*🐿ప్రశాంతంగా ఆలోచిస్తే,నిశ్శబ్దంగా ఉంటే బతుకు గడియారం శబ్దం దానికదే వినిపించి తీరుతుంది...సమాధానం కనిపించి తీరుతుంది...*

*🐺అంతేగాని ఒత్తిడికి గురైతే , తికమక పడితే , నానా యాగీ చేస్తే , పరేషాన్ అయితే , దుఖిస్తే ఫలితం వ్యతిరేఖంగా ఉంటుంది.*

బుధవారం, అక్టోబర్ 17, 2018

swami-vivekananda-ksc-writes

స్వామి వివేకానంద స్ఫూర్తి...సూక్తి -1

* నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు.అదే మానవకోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి బోధించి, వారి జీవిత ప్రతికార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే.

* సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

* ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.

సోమవారం, అక్టోబర్ 15, 2018

టీచర్ -- "భారత దేశం నుంచి 
             మొదటిసారిగా విదేశం
          వెళ్ళిన మహిళ ఎవరు?’’

విద్యార్ధి --"సీత టీచర్.
                శ్రీలంక వెళ్ళింది.’’

టీచరు ఇంకా కోమా లోంచి బయటకి రాలేదు..

*****
ఆ మేధావి విద్యార్థి పెరిగి, పెరిగి, పెద్ద లాయర్ అయ్యాడు....

ఒక జడ్జి గారు మన లాయర్ ని అడిగాడు :

"మహాభారతానికి , రామాయణానికి తేడా ఏమిటి?"

మన లాయర్....

"మహాభారతం భూమి తగాదా కేసు,
రామాయణం కిడ్నాప్ కేసు !"

జడ్జి గారు కోమాలోకి వెళ్లిపోయారు.....

> వాట్సప్ షేరింగ్ లో చూసి కామెడీగా ఉందని పోస్ట్ చేసా! ఎవరూ ఏమీ అనుకోమాకండి సుమా!! :)

గురువారం, అక్టోబర్ 11, 2018

యధావిధిగా భగవద్గీత చదువుతూ ఉంటే అసలు అసురులంటే ఎవరు? అనే సందేహం కలిగింది. చిరంజీవిగారు వ్రాసిన సురులు,అసురులు అన్న టపాలో ఆయన దేవతలైన వరుణుడు,ఇంద్రుడు, అగ్ని..ఇలా అనేకమందిని ఋగ్వేదం అసురులుగా పేర్కొనడం వ్రాసుకొచ్చారు.

ఋగ్వేదం 8.42.1. ఈ విధంగా అంటుంది: 

अस्तभ्नाद दयामसुरो विश्ववेदा अमिमीत वरिमाणं पर्थिव्याः |
आसीदद विश्वा भुवनानि सम्राड विश्वेत तानि वरुणस्य वरतानि ||

 "అసురుడైనటువంటి వరుణుడు.. పరలోకము మొదలుకోని.. భూమివరకు.. లోకమును కొలిచాడు.. ఈ క్రమంలో.. అతడు అన్ని జీవులని కలిశాడు." 

ఋగ్వేదం 1.174.1 కూడా ఇంద్రుడు అసురుడనే చెబుతుంది.. ఋగ్వేదం యొక్క అనేక శ్లోకాలు... మిత్ర, వరుణ, సావిత్రి, అగ్నీ, పుషన్ వంటి వేద దేవుళ్ళను అసురులుగా చెబుతున్నాయి.

అయితే పై ఋగ్వేద మంత్రాలను ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. నాకు పరిచయమున్న వేదం పండితులతో చర్చించవలసిన పరిస్థితి అంతకంటే ఎక్కువే ఉంది.

ఇకపోతే భగవద్గీతలో అసుర సంబంధమైన వారి గూర్చి క్రింది విధంగా ఉంది.
మచ్చుకు కొన్ని భగవద్గీత శ్లోకాలు.
తానహం ద్విషత: క్రూరా న్నంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు. {గీత 16:19}

తా:- నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ (పాప) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను జననమరణరూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.

ఆసురీం యోనిమాపన్నా మూడా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌన్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్. [గీత 16:20]

తా:- ఓ అర్జునా! అసురసంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూడులు ప్రతి జన్మయండును నన్ను పొందకయే, అంతకంటే (తాము పొందిన జన్మ కంటే) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.

ఈవిధంగా భగవద్గీత అసురసంబంధమైన గుణములు కలవారందరూ నీచజన్ములు అని క్రూరులని, అశుభ కార్యములు చేయువారని చెప్పడమే కాకుండా 16వ అధ్యాయం 13 -16 శ్లోకాలలో అసురులు యొక్క గుణగణాలను తెలియజేస్తూ "పతన్తి నరకేzశుచౌ" అపవిత్రమైన నరకమందు పడుచున్నారంటూ తెలియజేస్తుంది.

శుక్రవారం, అక్టోబర్ 05, 2018

reading-blogs-diluted

చదువూరించే బ్లాగులు కరువైపోయాయి.

అతి కొద్ది బ్లాగులు తప్ప ఇంట్రస్ట్ కలిగించే బ్లాగులు మాలికలో పెద్దగా కనిపించడం లేదు. పాతతరం వారి బ్లాగులు మళ్ళీ ఉనికిలోకి వస్తే బాగుణ్ణు. ఇంతకు ముందు మంచి,మంచి బ్లాగులు కనిపించేవి. హాస్య బ్లాగులు, కార్టూన్ బ్లాగులు, కథల బ్లాగులు, సాహిత్య,ఆధ్యాత్మిక.., ఇలా ఒకటేమిటి అనేక రకాల బ్లాగులు కలిపించేవి. ఇప్పుడవేవీ కనిపించడమే తగ్గిపోయింది. మాలికలో టపాల పేజీ కంటే "కామెంట్ల"పేజీకే విజిటింగ్ రేటు ఎక్కువనుకుంటా! ఎందుకంటే కొంతమంది అరకొర టపా వ్రాసినా తమతమ బ్లాగుల్లో కామెంట్లు పెట్టుకుని తరించడానికే ఇష్టపడుతున్నారు. నిజానికి వారు పెట్టుకుంటున్న ఆ కామెంట్లు వారు వ్రాసుకున్న టపాలకే సంబంధం ఉండదు. మళ్ళీ తెలుగు బ్లాగుల పూదోట వికసిస్తే బాగుణ్ణు.

శుక్రవారం, సెప్టెంబర్ 28, 2018

గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన  FUNDAMENTAL RULES

Fundamental Rules to be understood by Government employees
# F.R. 12(a)👉1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

#F. R. 12(బి)👉ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

# F. R. 12(c)👉ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

#F. R. 15(b)👉 ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

#F. R. 18👉govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

#F. R.18(a)👉1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

#F.R.18(బి)👉పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

మంగళవారం, సెప్టెంబర్ 18, 2018

కనువిందు చేసే  అందమైన పువ్వులు | Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching


Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

శుక్రవారం, సెప్టెంబర్ 14, 2018

Abhimanyudu-Telugu-Movie-ksc-writes
మనం ఎన్నో అవసరాల కోసం ప్రతీసారి ఎన్నో జెరాక్సులు మనకవసరమైన ప్రతి ఆఫీసుకు అందిస్తూనే ఉంటాం. అది పాన్ కార్డైనా, ఆధార్ కార్డయినా, లేక ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. అది కాని ఇంటర్ నెట్ దొంగల బారిన పడిందా అంతే సంగతులు. ఇక మన జీవితంలో పూడ్చుకోలేని విధంగా నష్టపోయినట్లే.

ఆధార కార్డ్ మీద ఉన్న మన ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ మీది సంతకం ఉన్న జెరాక్సులు ఆన్ లైన్ దొంగల బారిన పడిందా? ఇక అంతే. ఎవరూ కాపాడలేరు. అది ఎన్ని విధాల మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుందో మనమెవరమూ కూడా ఊహించలేవు. బ్యాంక్ అకౌంట్లు సైతం లూటీ అయిపోవడం ఖాయం. ఇది ఎలా సాధ్యం తెలియాలంటే మనం వెంటనే " అభిమన్యుడు" సినిమా చూడాల్సిందే.

"cashless india కోరుకుంటే చివరికి careless india మిగులుతుంది" అన్న డైలాగ్ మనల్ని ఆలోచనలలో పడేస్తుంది. పూర్తీ సందేశం కోసం వెంటనే అభిమన్యుడు సినిమా చూడండి.

గురువారం, సెప్టెంబర్ 13, 2018

The "Vinayaka Statue" is a big symbol of personality development

వ్యక్తిత్వ వికాసానికే పెద్ద ప్రతీక "వినాయక విగ్రహం" | The "Vinayaka Statue" is a big symbol of personality development

మన పూర్వీకులు కొన్ని గొప్ప, గొప్ప విషయాలను తాళ పత్రాల ద్వారా చిత్రాల ద్వారా,విగ్రహాల ద్వారా మనకు తెలియజేయడం కోసం పొందుపరచిన ఎన్నో దాఖనాలు ఇప్పటికీ మనముందున్నాయి. వాటిలో ఒక ప్రధానమైనది వినాయకుని విగ్రహం. నిజానికి మన పూర్వీకులు విగ్రహాల ద్వారా విజ్ఞానాన్ని నేర్పాలని చూసారు తప్ప అజ్ఞానాన్ని కాదు. అయితే కాలక్రమేణా అసలు విషయాలు అంతరించి పోయి "విగ్రహాలు పూజలందుకోవడం" ప్రారంభమయ్యాయి తప్ప వాటి ద్వారా మనం నేర్చుకోవాల్చిన జ్ఞానాన్ని మాత్రం మనం వదిలిపెట్టేసాము.

వినాయకుని విగ్రహం - మనకిచ్చే వ్యక్తిత్వ వికాసపు సమాచారం ఏమిటి?

ఏనుగు తల, ఏక దంతం, భారీ బొజ్జ వంటి వాటితో కూడిన వినాయకుని విగ్రహం హిందూ విగ్రహాలలో అన్నిటికంటే ఎక్కువ విమర్శలకు గురవుతుంది. వాస్తవానికి ఆ విగ్రహం అవ్యక్తుడైన దైవంపై విశ్వాసానికి, మానవతా విలువలకు సంకేతం. సాధారణ వాడుక భాషలో తెలివైన వాళ్ళను ఉద్దేశించి వారిది పెద్ద తల అని అనటం మనం వింటుంటాం. అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయం తెలుపటానికే వినాయకుని విగ్రహానికి భారీ తల పెట్టడం జరిగింది. అంటే వినాయకుని భారీ తల జ్ఞానానికి ప్రతీకన్నమాట.

శుక్రవారం, సెప్టెంబర్ 07, 2018

some-information-about-sarvepalli-Radhakrishnan

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గూర్చి కొంత సమాచారం | Some information about Sarvepalli Radhakrishnan

_*✏డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 5 , 1888 – ఏప్రిల్ 17 , 1975 ) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో( చైనా , పాకిస్తానులతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.*_

*📚బాల్యం విద్యాభ్యాసం📚*

_*✍సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.*_

_*📔వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. ఘసర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.*_

*🖍ఉద్యోగం🖍*

_*⛱21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది.*_⛱

_*🎤ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.*_

_*📔✍1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.*_

_*📚1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.*_

_*📘1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు.*_

_*✍🎤అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.*_

_*⛱🙏ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.*_

*⛱జీవిత విశేషాలు⛱*

_*🌸రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్ఛాన్స్లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.

ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్*_

_*✍1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.*_

_*🌺రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.*_

_*రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.*_

_*🌹రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.*_

📘🖍📔✏📕✒📚🖍📗✏📔🖍📕🖍📘📚📗

ఆదివారం, ఆగస్టు 19, 2018

నేను ఏర్పాటు చేసుకున్న small kitchen garden

నేను నెలరోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న The small kitchen garden ఇది. మాకు కొద్దిగా చిన్నపాటి స్థలం ఉంటే దానిలో క్రింది విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వంకాయ, చెట్టు చిక్కుడు, టమోటా, మిర్చి, తోటకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, క్యారెట్, మొక్కజొన్న, మూడు రకాల రోజా పూల మొక్కలు, కనకాంబరం మొక్క, బంతిపూల మొక్కలు నాటడం జరిగింది. ఇలా ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.










The small kitchen garden I have set up

మంగళవారం, ఆగస్టు 14, 2018

indian-national-flag-rules-what-we-must-Know

💐జాతీయ జెండా నియమాలు


🚩2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి.
🚩జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.
🚩Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు

ఝండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య. 

1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచు మొదలగు వారు). 
2.👉కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO  హెడ్ మాష్టర్  ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా  రెండు రకాలు. మనం  కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వహుకులం. 
3.👉పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు,  26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి. 

ఆదివారం, ఆగస్టు 12, 2018

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.
అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే.
ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."
మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.
మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

సోమవారం, జులై 30, 2018

*Very interesting & meaningful msg 2 share:*


*If:* 
*A = 1 ; B = 2 ; C = 3 ; D = 4 ;*
*E = 5 ; F = 6 ; G = 7 ; H = 8 ;*
*I = 9 ; J = 10 ; K = 11 ; L = 12 ;*
*M = 13 ; N = 14 ; O = 15 ; P = 16 ;*
*Q = 17 ; R = 18 ; S = 19 ; T = 20 ;*
*U = 21 ; V = 22 ; W = 23 ; X =24 ;*
*Y = 25 ; Z = 26.*

*Then,*

*H+A+R+D+W+O+R+K* 
=8+1+18+4+23+15+18+11
*= 98%*

*K+N+O+W+L+E+D+G+E*
=11+14+15+23+12+5+4+7+5
*=96%*

*L+O+V+E*
= 12+15+22+5 
*= 54%*

*L+U+C+K ;*
=12+21+3+11 
*= 47%*

*None of them makes 100%.*
*Then what makes 100%?*

*Is it Money?*
.
.
.
*NO!*

*M+O+N+E+Y*
= 13+15+14+5+25
*=72%*

*Leadership?*
.
.
.
*NO!*

*L+E+A+D+E+R+S+H+I+P*
=12+5+1+4+5+18+19+8+9+16
*=97%*

*Every problem has a solution, only if we perhaps change our*

     *"ATTITUDE"...*

*A+T+T+I+T+U+D+E ;*
1+20+20+9+20+21+4+5 
*= 100%*

*It is therefore OUR ATTITUDE towards Life* *and Work that makes*
*OUR Life 100% Successful.*

*Amazing mathematics*
*With each alphabet getting a number, in chronological order, as above, study the* *following, and bring down the total to a single digit and see the result yourself*

*Hindu -*
*S  h  r  e  e   K  r  i  s  h  n  a*
19+8+18+5+5+11+18+9+19+8+14+1
=135
*=1+3+5 = 9*

*Muslim*
*M  o  h  a  m  m  e  d*
13+15+8+1+13+13+5+4
= 72
*= 7+2 = 9*

*Jain*
*M a  h a v  i  r*
13+1+8+1+22+9+18
  =72
*= 7+2= 9*

*Sikh*
*G  u  r  u   N  a  n  a  k*
7+21+18+21+14+1+14+1+11 
=108 
*=1+0+8 = 9*

*Parsi*
*Z  a  r  a  t  h  u  s  t  r a*
26+1+18+1+20+8+21+19+20+18+1
=153
*=1+5+3 = 9*

*Buddhist*
*G  a   u  t  a  m*
7+1+21+20+1+13
=63
*= 6+3 = 9*

*Christian*
*E  s   a  M  e  s  s  i   a  h*
5+19+1+13+5+19+19+9+1+8
=99
9+9=18
*1+8 = 9*

*Each one ends with number  9*

*THAT IS NATURE'S CREATION TO SHOW THAT GOD IS ONE !!!*

👈 *who ever created this msg's great.....* *msg*👌👌👌👌💖✨✨✨🌟🌟🌟✨✨💖💖
*plz share it to all ur friends*

గమనిక : Wattsapp నుండి సేకరించినవి. అందరికీ ఉపయోగమన్న ఉద్దేశ్యంతో పోస్ట్ చేయడం జరిగింది.

శనివారం, జులై 28, 2018

ఒక మామ తన ముగ్గురు అల్లుళ్లను బాగా కట్నకానుకలిచ్చి ప్రయోజకుల్ని చేశాడు.

 ఒకరోజు వారిని పిలిచి 'నేను చనిపోయినపుడు మీరు ముగ్గురూ తలొక లక్షరూపాయలు నా శవ పేటికలో పెట్టండి' అని కోరితే వారు అంగీకరించారు.

 కొన్నాళ్ళకు మామ చనిపోయాడు.

డాక్టర్ గా ఎంతో గొప్పవాడైన పెద్దల్లుడు మామ కోరిక మేరకు 500 నోట్లు 200 తెచ్చి శవపేటికలో పెట్టాడు.

 ఇంజనీర్ గా పైకొచ్చిన రెండవ అల్లుడు 2000 నోట్లు 50 తెచ్చి మామ శవపేటికలో పెట్టాడు.

 మూడవవాడు లాయర్ గా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతడొచ్చి  తాను రాసిన మూడులక్షల రూపాయల చెక్కును శవపేటికలో పెట్టి , అందులోని రెండులక్షల నగదు తీసేసుకున్నాడు.

బుధవారం, జులై 25, 2018

1st నుండి 5th Class వరకు గల FA 1 Question Papers Free Download

ఆగష్టు నెల నుండి 1st నుండి 5th Class వరకూ FA 1 పరీక్షలు జరగనున్నాయి. మీ ఫ్యామిలీలో ఆ క్లాసులు చదివే పిల్లలుంటే ఈక్రింది లింక్ ద్వారా FA 1 Question Papers Download చేసుకోవచ్చు.

Formative 1 Assisment Model question papers for 1st to 5th Classes

మంగళవారం, జులై 24, 2018

Bill-To-Provide-Strict-Punishment-In-Rape-Cases--Introduced-In-Lok-Sabha-kscwrites

రేపిస్టు వెధవలకు ఉరిశిక్ష - అమలుకు నోచుకునేదెంత?

భారత దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో అత్యాచారాలు అంతకంతకూ విపరీతంగా పెరిగి పోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతకా.. తర తమ భేదం లేకుండా సాగుతున్న రేప్ ల నేపథ్యంలో దేశం పరువు ప్రతిష్ఠలు ప్రశ్నార్థకంగా దిగజారి పోతున్నాయి. ఆ మధ్య వరకూ ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా మంట కలిసి పోతోంది. దేశంలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న అత్యాచార ఉదంతాల నేపథ్యంలో మోడీ సర్కారు ఈ మధ్యన ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

పన్నెండేళ్ల బాలికల్ని రేప్ చేస్తే ఉరి విధించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. తాజాగా ఇదే అంశాలతో బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. కతువా.. ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టారు.

 


Recent Posts