బుధవారం, అక్టోబర్ 19, 2016

ఈ రోజుల్లో పుస్తకాల వ్యాపారం పెద్ద వ్యాపారం అన్నది నిజం. ప్రతి సంవత్సరం 60,000 కొత్త పుస్తకాలు ప్రచురితమవుతుంటాయి. గత దశాబ్దంలో అమ్మకాలు, సంవత్సరానికి 5-6 శాతం చొప్పన పెరిగాయి.

ఇది మంచి వార్త. చెడువార్త ఏమిటంటే అమ్ముడుపోయిన పుస్తకాలలో 50 శాతం పుస్తకాలు ఎవరూ చదవరు. ఆశ్చర్యకరమైన విషయం కదూ? చదివి, ఎదగలనే ఉద్దేశంతో జనం పుస్తకాలు కొంటారు, కాని సగం మంది జనం ఆ పుస్తకాలు చదవరు. హెల్త్ క్లబ్బుకి డబ్బు కట్టి ఒక్కరోజు కూడా వెళ్లకపోవడం లాంటిది ఇది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పడు మనకు లాభం చేకూరదు. ఆ వస్తువును మనం వాడినప్పడే మనకు ఆ వస్తువు వలన లాభం చేకూరుతుంది. ఏది ఏమైనా ఈ ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారు?

ఒక అడుగు ముందుకు - రోజుకు పదిహేను నిమిషాల చదువు మీ జీవితాన్ని మార్చగలదు

వాస్తవమేమిటంటే, ప్రపంచంలో అక్షరాస్యుడైన ప్రతి వ్యక్తి, కొంచెం చొరవ తీసుకున్నాట్లయితే చదువు ద్వారా ఒక అడుగు ముందుండగలడు. కేవలం పుస్తకాలు, సమాచారం దగ్గర ఉంచుకుంటే సరిపోదు. మనం సంపన్నులం కావాలంటే, మనం సమాచారాన్ని చదివి మన జీవితాలకు అన్వయించాలి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts