సోమవారం, సెప్టెంబర్ 12, 2016

ఈమాట అన్నందుకు మహిళా మణులు నన్ను విమర్శించవచ్చు. అయినా ఏం పర్లేదు. ఎందుకంటే ఈరోజు అత్యధికంగా పురుషులు నరకయాతన అనుభవించేది, మానసికంగా క్రుంగిపోయేది కేవలం స్త్రీ వలన మాత్రమే.నిజానికి స్త్రీ తన జీవితంలో అనేక పాత్రలు ధరిస్తుంది. అందులో అతి పవిత్రమైనది, మాటలతో వర్ణించలేనిది ఒక్క తల్లి పాత్ర మాత్రమే. దీనికి మాత్రమే స్త్రీ నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చుతుంది. మిగతా అన్ని పాత్రలకు అన్యాయం చేసేదే! పురుషునికి నరకయాతన చూపించే ప్రధాన అస్త్రం భార్య పాత్ర. నాకు తెలిసి ఈ పాత్రకు చట్టాల అనుమతి కూడా ఉంది. ఆమే  తప్పు చేసి ఆమే కోర్టు కేక్కితే మన భారత చట్టాలన్నీ ఆమెకు మాత్రమే సహకరిస్తాయి. పురుషుడు మాత్రం నిలువునా అన్యాయంలో మునిగిపోవాల్సిందే.

         పురుషునితో సమాన హక్కులు కోరుకునే స్త్రీ మణులు సమాన చట్టాలకు ఎందుకు సహకరించరో? పురుషునితో సమానమని విర్రవీగుతున్న స్త్రీలు బయట మృగ పురుషులకు బలవ్వుతున్న దాఖలాలెన్నో. నిజానికి స్త్రీ తన పురుషున్ని అర్ధం చేసుకోవడం కంటే అపార్ధం చేసుకోవడానికే పని చేస్తుంది.

      అందుకే అనుకుంటాను కొంతమంది మహానుభావులు స్త్రీ గూర్చి ఇలా హెచ్చరించారు.
1.స్త్రీ నీడ లాంటిది. పట్టుకోవాలంటే దొరకదు. పట్టించుకోవడం మానివేస్తే నీ వెనుకే తిరుగుతుంది.
2.స్త్రీ నది లాంటిది దొర్లించుకుంటూ పోయి సముద్రంలోకి విసిరివేస్తుంది.
౩.స్త్రీ మనస్సు అద్దంతో సమానం,పగిలితే అతకదు అన్న మాట పచ్చి అబద్ధం.  ఇది కేవలం పురుషునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చరిత్రలో అన్యాయానికి గురైంది పురుషులే. ఉదా:కు పార్వతి,దేవదాసుల్లో దేవదాసే పోయాడు. లైలా,మజ్నూలలో మజ్నూయే పోయేడు.
         అందుకనే స్త్రీ పట్ల పురుషుడు జాగ్రత్త వహించాలి. ఆదమరచియుంటే మనం మటుమాయమవ్వడం ఖాయం.మనకందరికీ స్త్రీ నుండి రక్షణ లభించుగాక! శుభం!!!

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts